Operation Sindhur

 

ఇది మనమందరం గర్వించదగ్గ సందర్భం: మోడీ

By The Wire Editorial Team on May 7, 2025

featured image

తమ నిర్ధిష్ట లక్ష్యాలైన పాకిస్తాన్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల మీద తక్కువ సమయంలో ఖచ్చితమైన దాడులు చేసినందుకు గాను ప్రధాని నరేంద్రమోడీ సాయుధ దళాలకు అభినందనలు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌, పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకోని భారత సైనిక దళం దాడులను నిర్వహించింది. దీని మీద స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ ఇది అందరు గర్వించదగిన సందర్భమని క్యాబినేట్‌ సమావేశంలో అన్నారు.

నిర్దిష్టలక్ష్యాలైన తొమ్మిది ఉగ్రవాద క్యాంపుల మీద తక్కువ సమయంలో దాడులు నిర్వహించడంతో భద్రతా బలగాలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. బాలాకోట్‌ తర్వాత చాలా విస్త్రృతమైన సరిహద్దు దాడులను కేవలం 25 నిమిషాలలో వేగంగా, సమన్వయ మెరుపు దాడులతో భారత ఆర్మీ నిర్వహించింది. ఆపరేషన్‌ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద ఆవాసాలను లక్ష్యంగా చేసుకుంది.

నిషేధిత సంస్థలైన జైష్‌-ఏ- మొహమ్మద్‌, లష్కర్‌-ఏ-తైబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన 80 కంటే ఎక్కువ ఉగ్రవాదులు ఈ నిర్దిష్ట దాడులలో చనిపోయారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సైనిక చర్యను అంచనా వేసి లక్ష్యాలను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ఒక సమావేశంలో తెలిపింది. భారత క్షిపణి దాడులలో తమ 26 మంది పౌరులు చనిపోయారని, 46 మంది గాయపడ్డారని ఇస్లామాబాద్‌ పేర్కొన్నది.

పాకిస్తాన్‌ సైనిక స్థావరాలను కాకుండా కేవలం ఉగ్రవాద కేంద్రస్థావరాలపై దాడులను నిర్వహించినట్టుగా భారతదేశం తెలిపింది. "మా చర్యలు కేంద్రీకరించబడ్డాయి, కొలవబడ్డాయి ఇంకా స్వభావరీత్యా ఎక్కువ కావు, లక్ష్యాల ఎంపిక ఇంకా అమలులో భారతదేశం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింది'' అని భారత ప్రభుత్వం ఒక ప్రకటలో తెలియజేసింది.

ఈ దాడిని "నిర్లక్ష్యమైన యుద్ధ చర్య"గా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందనగా "తగిన సమాధానం" ఇవ్వడానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందని అన్నారు.

పాకిస్తాన్‌, పీఓకేలో జరిగిన ప్రస్తుత సైకిక చర్యకు ఆపరేషన్‌ సిందూర్‌ అని పేరు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారి భార్యలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ ఈ ఆపరేషన్‌కు సిందూర్‌ అని కేతనామం పెట్టారు. అయితే, ఉగ్రవాద దాడి వల్ల కలిగే మానవ నష్టం ప్రధానమంత్రికి స్పష్టంగా తెలుసని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.




Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

ABN , Publish Date - May 07 , 2025 | 04:42 PM

ఆపరేషన్ సిందూర్ భారత ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో చాలా కీలకమైన దాడి అని చెప్పవచ్చు. ఈ దాడులు జైష్ ఏ మొహమ్మద్ సంస్థకు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో దీని ప్రధాన కార్యాలయాన్ని భారత సైన్యం చిత్తుచిత్తుగా కూల్చేసింది. అయితే ఈ దాడికి ముందు ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor

భారత సైన్యం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో ఖచ్చితమైన దాడులు చేసి, ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మొహమ్మద్ (JM) ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. ఈ దాడులు భారతదేశం ఉగ్రవాదంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టం చేశాయి.

Adevertisement
Powered by:PS
Loaded100.00%

దాడికి ముందు

ఆపరేషన్ సిందూర్‎కు ముందు, జైష్ ఏ మొహమ్మద్ సంస్థ పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో వారి ప్రధాన కార్యాలయం ‘మర్కజ్ సుభాన్ అల్లాహ్’ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ కేంద్రం భారత్‌పై అనేక దాడులకు కీలక స్థావరంగా పనిచేసింది. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి, ఇక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదుల చేతిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంస్థ మసూద్ అజార్ నాయకత్వంలో గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో ఉగ్రవాద దాడులకు కారణమైంది. అయితే తాజా దాడుల తర్వాత ఆ కార్యాలయం అస్తవ్యస్తంగా తయారైంది. దీంతోపాటు దాడికి ముందు అందులో ఉన్న ఉగ్రవాదులు సైతం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.


ఉగ్రవాదులకు కేంద్రంగా..

బహవల్‌పూర్, పాకిస్తాన్‌లోని 12వ అతిపెద్ద నగరం, జెఎమ్ కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాల సరఫరా దాడుల ప్రణాళికలు జరిగేవి. ఈ కార్యాలయంలో అనేక భవనాలు, శిక్షణా మైదానాలు, ఆయుధ గిడ్డంగులతో సమగ్రంగా నిర్మించబడింది. ఈ స్థావరం ఉగ్రవాదులకు సురక్షిత ఆశ్రయంగా ఉంది. ఎందుకంటే ఇది పాకిస్తాన్ లోపల ఉండటం విశేషం. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి ఈ ఆపరేషన్‌కు నాంది పలికింది.


దాడి సమయంలో

బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సమన్వయంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK), పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు చేశాయి. ఈ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయి. పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను ఏమాత్రం దెబ్బతీయలేదు. ఇది భారత్ చేపట్టిన దాడి విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ దాడికి ముందు, దాడి తర్వాత జరిగిన విధ్వంసానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో ఓ బీజేపీ నేత పోస్ట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడులు జెఏమ్ సంస్థకు గట్టి షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు.

Comments

Popular posts from this blog

Deep state in the United States

The CAA will be implemented before the elections.

Who supported Trump